తిరుమల శ్రీవారి దర్శన టికెట్లపై పూర్తిస్థాయి విచారణ జరిగేలా చూస్తామని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమలలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి దర్శన టికెట్లను చాక్లెట్లను పంచినట్లు పంపినీ చేశారు. ఒక లెటర్ పైనే పెద్దిరెడ్డి 54 మందిని దర్శనాలకు సిఫార్సు చేయడం ఏంటనీ ప్రశ్నించారు. మాజీ మంత్రులు రోజా, నారాయణ స్వామి ఇక్కడే ప్రదక్షణలు చేస్తారని ఎద్దేవా చేశారు.