గోశాలకు చేరుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి

82చూసినవారు
గోశాలకు చేరుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి
AP: తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్వీ గోశాలలో ఆవులు మృతి చెందాయని వైసీపీ నేతలు ఆరోపించగా.. అది నిరూపించాలని కూటమి నేతలు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఎస్వీ గోశాల వద్దకు కూటమి నేతలు చేరుకోగా.. తాజాగా తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ఒంటరిగా అక్కడికి చేరుకున్నారు. దీంతో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, గురుమూర్తికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. గోశాలకు భూమన వస్తే ఎవరు అడ్డుకుంటారంటూ ఆయనను కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్