AP: నెల్లూరు జిల్లా మర్రిపాడు డీసీ పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పొగాకు కూలీలకు చెందిన గుడిసెలు దగ్ధమయ్యాయి. మంటలు వ్యాపించడంతో గుడిసెల్లో ఉన్న 3 గ్యాస్ సిలిండర్లు పేలాయి. ప్రమాద సమయంలో కూలీలు పనులకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.