AP: రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. YCP నాయకులు అధికారం కోల్పోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. త్వరలో వైసీపీ కార్యాలయానికి టూ-లెట్ బోర్డు పెట్టబోతున్నారని.. అందుకే ఆందోళనలో ఆ పార్టీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. ఐదేళ్లు అరాచకాలు చేసి, ప్రజలను పీడించుకొని తిని.. వైసీపీ నేతలు ఇవాళ నీతులు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.