అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. గడ్డకట్టిన సెలా సరస్సుపై పర్యాటకులు నడుచుకుంటూ వెళుతుండగా చిక్కుకుపోయారు. అనంతరం స్థానిక అధికారులు తాళ్ల సహాయంతో వారిని రక్షించారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. సరస్సులపై అనుభవజ్ఞులైన గైడ్లతో మాత్రమే నడవండి, మంచుతో నిండిన రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి 'అని సలహా ఇచ్చారు. ఈ వీడియో వైరల్గా మారింది.