AP: తిరుమలలో భక్తుల ఆహార భద్రత కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ఫుడ్సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. తిరుమలలో భక్తులకు అందించే ఆహార నాణ్యతను పెంచడానికి, కల్తీని అరికట్టడానికి ఈ విభాగం పనిచేస్తుంది. ఈ క్రమంలో త్వరలో ఒక సీనియర్ ఫుడ్సేఫ్టీ అధికారి నియామకంతో పాటు రాష్ట్రస్థాయి ఫుడ్సేఫ్టీ ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నారు.