తుర్కియే సంస్థ సెలెబీకి ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్ను భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ సంస్థ కోర్టుకెక్కింది. జాతీయ భద్రతా కారణాలు చూపి ముందస్తు సమాచారం లేకుండా తమ సేవల్ని భారత్ నిలిపివేయడం దారుణమని పిటీషన్లో పేర్కొంది. దీని వల్ల 3791 మంది ఉద్యోగాలను కోల్పోతారని ఢిల్లీ హైకోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేసింది.