మహారాష్ట్రలోని షిర్డీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సాయిబాబా సంస్థాన్కు చెందిన ఇద్దరు ఉద్యోగులను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పలుమార్లు పొడిచి చంపారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులను కర్దోబా నగర్కు చెందిన సుభాష్ సాహెబ్ రావ్ (43), సకోరి శివ్కు చెందిన నితిన్ కృష్ణ (45)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.