తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. వేరువేరు ఘటనలలో ఇద్దరు ఎస్ఐల మృతి చెందారు. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి చెందారు. శ్వేత జగిత్యాల హెడ్క్వార్టర్స్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.