AP: ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లొచ్చిన వ్యక్తి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై బుధవారం మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశనగర్లో సంతోష్ కుమార్(39), జయశ్రీలు ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. సంతోష్కుమార్ ఉపాధిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో విదేశాలకు వెళ్లి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పు బారిన పడటంతో బుధవారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.