ఉగ్రవాద అనుమానితులు సిరాజ్, సమీర్ కస్టడీ పిటిషన్పై విజయనగరం జిల్లా కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. వారిని ఒక వారం పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, కోర్టు పిటిషన్పై ఈ రోజు వాదనలు వినిపించాక తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.