ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన భార్య సుదేశ్తో కలిసి సీపీడబ్ల్యూడీ సర్వీస్ సెంటర్లోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ క్యూలో నిల్చున్నవారిని పలకరించారు