టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్కు బిగ్ షాక్ తగిలింది. రాంగ్ రూట్లో ప్రయాణించడమే కాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించడంతో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసుల విచారణకు బెల్లంకొండ శ్రీనివాస్ హాజరయ్యారు. అవసరం ఉన్నప్పుడు కోర్టు విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించారు.