భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. విజయవాడలో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలీసులు రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల బ్యాగుల తనిఖీలు.. వారి వివరాల సేకరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సీఎస్ లకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తనిఖీలు చేపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.