జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కిమిడి నాగార్జున సోమవారం అన్నారు. చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో మెలగాలని ఎటువంటి అల్లర్లకు వెళ్ళకూడదని కవ్వింపు చర్యలకు పాల్పడద్దన్నారు. అందుబాటులో కార్యాలయంలో ఉంటాను అని తెలిపారు.