కృష్ణమూర్తి సేవలు మరువలేనివి

75చూసినవారు
కృష్ణమూర్తి సేవలు మరువలేనివి
ప్రధానోపాధ్యాయుడిగా కృష్ణమూర్తి నాయుడు అందించిన సేవలు మరువలేనివని ఎంఈఓ లు విమలమ్మ, సాయి చక్రధర్, శివాజీలు అన్నారు. బుధవారం సాయంత్రం గజపతినగరం మండలంలోని గంగచోళ్లపెంట హైస్కూల్ హెచ్ఎం గా పనిచేసి పదవీ విరమణ పొందిన కృష్ణమూర్తినాయుడును పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేశారన్నారు. హెచ్ఎం రమేష్ కుమార్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ బొంతల కోటి శంకరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్