డెంకాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఎమ్మెల్యే లోకం మాధవి చేతుల మీదుగా విద్యార్థులకు టెక్స్ట బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కంది చంద్రశేఖరరావు, మాజీ జెడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ, పల్లె భాస్కరరావు పాల్గొన్నారు.