తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విజయనగరం కు చెందిన తణుకు మోహన్ రావు గురువారం సైకిల్ యాత్ర ప్రారంభించారు. జామి మండలం అలమండ వద్ద ఆయన కాసేపు మీడియాతో మాట్లాడారు. విజయనగరం ఎమ్మెల్యేగా అతిథి గజపతిరాజు గెలిచి, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సైకిల్ పై వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నానని, తన కోరిక తీరడంతో తిరుమలకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.