ఎస్ కోట మండలం నక్కలవలస గ్రామ సమీపంలో త్రాగునీరు పైపులైను మరమ్మత్తు పనులు చేపడుతున్న నేపథ్యంలో ఎస్ కోట మండలంలో 100 గ్రామాలకు కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా రెండు రోజులు జరగదని పైలెట్ ప్రాజెక్టు పర్యవేక్షకులు రాము తెలిపారు. మంగళ బుధవారాల్లో మంచినీరు సరఫరా జరగదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.