ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫించన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి 8 గంటల వరకు 98. 05 శాతం లబ్ధిదారులకు ఫించన్ పంపిణి పూర్తి చేసి రాష్ట్రంలో విజయనగరం జిల్లా మూడో స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2, 80, 352 ఫించన్ దారులు వుండగా వీరిలో 2, 74, 881 మందికి ఫించన్ మొత్తాల పంపిణీ పూర్తి అయినట్లు పేర్కొన్నారు.