బొబ్బిలి మండలం కోమటిపల్లిలో గురువారం అంగన్వాడీ కేంద్రంలో సీడీపీఓ జే. విజయలక్ష్మి ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం జరిగింది. గర్భిణీ స్త్రీల తొలి వెయ్యి రోజులు కీలకమని ఆమె పేర్కొన్నారు. డాక్టర్ లక్ష్మి పోషకాహారం, జాగ్రత్తలపై అవగాహన కలిపించారు. యోగా టీచర్ అరుణ యోగాసనాలు నేర్పించారు. అనంతరం సీమంతం నిర్వహించారు.