పురుగు మందుల షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు తప్పనిసరిగా బిల్లులు డీలర్లు ఇవ్వాలని రామభద్రపురం మండల వ్యవసాయశాఖ అధికారి వెంకటయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలో పురుగుమందు షాపులు తనిఖీల్లో భాగంగా రికార్డులను పరిశీలించి వచ్చిన స్టాకు ఉన్న స్టాకు సరిపోయిందా లేదా అని చూశారు. స్టాక్ బోర్డులో వివరాలు నమోదు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు.