పారిశుద్ధ్య పనులకు సకాలంలో హాజరు కావాలని కార్మికులను మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి ఆదేశించారు. శానిటరీ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మస్టర్ రికార్డును పరిశీలించారు. సకాలంలో విధులకు హాజరుకానీ కార్మికులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.