బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి శుక్రవారం పట్టణంలోని అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా టిఫిన్ నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాలు, టిఫిన్ పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్యాంటీన్ పరిధిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.