నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధించే ప్రభుత్వ పాఠశాలల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని బొబ్బిలి మండలం పెంట జడ్పీహైస్కూల్ హెచ్. ఎం చింతా రమణ అన్నారు. శుక్రవారం పాఠశాల సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విద్యలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.