క్షయవ్యాధిపై ప్రత్తిఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఎయిడ్స్ అండ్ టి. బి. కంట్రోల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ జశ్వంత్ తెలిపారు. శుక్రవారం బొబ్బిలిలో టి. బి. పై ప్రజలకు అవగాహన కల్పించడానికి 100 రోజులు ప్రత్యేక వాహనం ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక వాహనంలో ఉచిత కఫం పరీక్షలు, ఎక్స్-రేలు తీయడం జరుగుతుందని అన్నారు.