గుజరాత్ విమాన ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై బొబ్బిలి కారుణ్య, రోటరీ చైర్మన్ జె సి రాజు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఘోర దుర్ఘటన బాధాకరమన్నారు. అలాగే విమానం హాస్టల్ భవనంపై కూలడంతో 35 మందికి వైద్య విద్యార్థులు మృతి చెందడం, మరో 16 మంది తీవ్రంగా గాయపడటం హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు.