రామభద్రపురం మండలం నాయుడువలస గ్రామానికి చెందిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు ఎ. సత్యనారాయణ (30) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం పాముకాటుకు గురయ్యారు. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన భార్య చాలా కాలం క్రితం మృతిచెందారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.