లేబర్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా జులై 9న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని మధ్యాహ్న భోజన కార్మికులు బొబ్బిలి ఎంఈవో లక్ష్మణరావుకు శనివారం సమ్మె నోటీసు ఇచ్చారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలంటూ సంఘం అధ్యక్షురాలు రామలక్ష్మి డిమాండ్ చేశారు.