రేపు (శనివారం) రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వి. అనిత, ఎం. ఎస్. ఎం. ఇ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రావు రానున్నారు. బొబ్బిలి కోటలో మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు(బేబీ నాయన) శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా సమావేశానికి టీడీపీ ముఖ్య నాయకులు హాజరవ్వాలని కోరారు. జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు.