బొబ్బిలి మండలం పారాది గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఎంపీడీఓ పి. రవికుమార్, డీఎల్డీవో కిరణ్ కుమార్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై వారు ఆరాతీశారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఏఏ సమస్యలు ఎక్కువగా సచివాలయానికి వస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు.