బొబ్బిలి డివిజన్ పరిధిలో 132/33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంట ల నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ అనంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నారసింహునిపేట సబ్ స్టేషన్, కలవరాయి ఫీడర్ పరిధిలోగల గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. వినియోగ దారులు గమనించి సహకరించాలని కోరారు.