బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నాయకుడు ఆవాల గురువులు గురువారం సాయంత్రం మృతి చెందారు. గురువులుకు నలుగురు కుమారులు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని స్థానిక నాయకులు గొట్టాపు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం గురువులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.