లేబర్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 20న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలోని చర్చి సెంటర్లో శనివారం జీపు జాతాను యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు ఎం.గోపాలం జెండా ఊపి ప్రారంభించారు. చర్చి సెంటర్ నుంచి ఆర్టిసి కాంప్లెక్స్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు.