ఆంధ్ర రాజా రామ్మోహన్ రాయ్ గా పిలవబడే కందుకూరి వీరేశలింగం తెలుగు నాట గొప్ప సంఘ సంస్కర్తని రోటరీ, కారుణ్య సంస్థల చైర్మన్ జె సి రాజు అన్నారు. వీరేశలింగం పంతులు జయంతి నేపథ్యంలో ఆయన తెలుగు ప్రజలకు చేసిన సామాజిక సంస్కరణలను స్మరిస్తూ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళాభ్యుదయం విద్యతోనే ముడిపడి ఉందని నమ్మి మహిళా విద్యను ప్రోత్సహించారు. శ్రీ హరి, శివ కాంత్, సోమేశ్వర రావు పాల్గొన్నారు.