బాల్య వివాహాల నిర్మూలనలో కీలక పాత్ర పోషించాలని ఐ. సి. డి. ఎస్. సి. డి. పి. ఓ. జే. విజయలక్ష్మి కోరారు. బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామంలో గురువారం జరిగిన బాలల రక్షణ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బాలల హక్కుల రక్షణకు, వారి పరిరక్షణకు కమిటీ సభ్యులు పని చేయాలని తెలిపారు. బాలల అక్రమ రవాణా జరగకుండా గ్రామంలో నిఘా కమిటీని యేర్పాటు చేయాలని తెలిపారు. బాల్య వివాహాలు జరిగితే వెంటనే అంగన్వాడి కార్యకర్తలకు తెలియజేయాలని కోరారు.