బొబ్బిలి పట్టణ పరిధిలో ఆరి గంగయ్య కాంప్లెక్స్, శ్వేత చలపతి స్కూల్, దిబ్బ వీధిలలో మున్సిపల్ కమీషనర్ రామ లక్ష్మి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పరిశుభ్రతను పాటించాలని, నీరు పారే విధంగా కాలువల్లో మట్టిని తొలగించాలని పారిశుధ్య సిబ్బందికి ఆదేశించారు. ఈ పర్యటనలో వార్డ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.