విజయనగరం జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శనివారం శంకుస్థాపన జరగనుంది. ఈ నేపథ్యంలో బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామంలో 11 గంటలకు ఎంఎస్ఎంఈ పార్కులకు హోంశాఖ మంత్రి వంగల పూడి అనిత, రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేయనున్నారని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఒక శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు.