రామభద్రపురం మండలంలోని బూసాయవలస గ్రామానికి చెందిన యువ పాటల రచయిత రాం పైడిశెట్టి (42) శుక్రవారం అకస్మాత్తుగా హైదరాబాదులో మృతి చెందారు. చంటి, సితార, కలెక్టర్ గారి భార్య, నందీశ్వరుడు తదితర సుమారు 20 సినిమాలకు పాటల రచయితగా పైడిశెట్టి పనిచేసారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ గాయకుడు ఆకస్మికంగా మృతి చెందడం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ గాయనీ మణులతో పనిచేశారు.