రాజాంలో ఇటీవలి రోజుల్లో మంచినీటి సరఫరా తగిన విధంగా లేకపోవడంతో మహిళలు రోడ్డెక్కారు. పైపులైన్లు తరచూ పాడైపోవడంతో నీటి పంపిణీకి అంతరాయం కలిగింది. దీంతో బొబ్బిలి రోడ్డుపై అడ్డుగా వారు వాహనాలను ఆపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి పరిస్థితిని నియంత్రించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది.