రామభద్రపురం కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ( సి.డి.సి.) రెహస్విస్ ద్వారా దివ్యాంగులకు అందించిన రుణ సహాయంతో బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామానికి గంట ఈశ్వరరావు కాయగూరలు వ్యాపారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఈశ్వరరావు శనివారం మాట్లాడుతూ.. సి.డి.సి. అందించిన 10000 రూపాయల రుణంతో కోమటి పల్లి గ్రామంలో వ్యాపారాన్ని ప్రారంభించానని తెలిపారు.