రామభద్రపురం: ఎంయస్ఎంఈ పార్కు శంకుస్థాపనకు సర్వం సిద్ధం

60చూసినవారు
రామభద్రపురం: ఎంయస్ఎంఈ పార్కు శంకుస్థాపనకు సర్వం సిద్ధం
రామభద్రపురం మండల పరిధి కొట్టక్కిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపనకు సర్వం సిద్ధం చేసినట్లు తహసిల్దార్ సులోచనారాణి శుక్రవారం తెలిపారు. శనివారం ఉమ్మడి జిల్లాల మంత్రులు, హోమ్ మంత్రి అనిత చేతుల మీదుగా ఉదయం 10. 00 గంటలకు శంకుస్థాపన జరగనున్నట్లు చెప్పారు. ఇందుకోసం సర్వే నంబర్ 6342 లో 187. 22 ఎకరాల విస్తీర్ణంలో స్థలాన్ని గుర్తించి కేటాయించామన్నారు.

సంబంధిత పోస్ట్