రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రదాన ధ్యేయమని వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చంనాయుడు అన్నారు. మన్యం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటనకు శ్రీకాకుళం నుంచి రామభద్రపురం మీదుగా సోమవారం వెళుతూ విశ్రాంతి నిమిత్తం ప్రైవేటు పాఠశాల గెస్టు హౌస్ వద్ద ఆయన మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్ లోరైతులకు విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.