లేబర్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 20న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జీపుజాతాతో వచ్చి ప్రచారం చేశారు. సీఐటీయు జిల్లా కార్యదర్శి కే. సురేష్ మాట్లాడుతూ. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ చట్టాలను తీసుకురావడం అన్యాయమన్నారు.