రామభద్రపురం: అక్రమంగా మద్యం తరలిస్తున్న మహిళ అరెస్టు

84చూసినవారు
రామభద్రపురం: అక్రమంగా మద్యం తరలిస్తున్న మహిళ అరెస్టు
రామభద్రపురం మండల పరిధి కోటశిర్లాం గ్రామానికి చెందిన ఓ మహిళ అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ సీఐ చిన్నంనాయుడు తెలిపిన వివరాల మేరకు ఎటువంటి అనుమతులు లేకుండా 11 మద్యం సీసాలు తరలిస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకొని, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితురాలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అక్రమంగా మద్యం, బెల్టు షాపుల్లో అమ్మకాలు, నాటుసారా తయారీ, విక్రయాలు జరిపితే కేసులు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్