రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం బొబ్బిలి కోటలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ టీడీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జరిగే పార్టీ కమిటీలు నియామకంలో అందరు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.