విజయనగరం పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక లీలా మహల్ థియేటర్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారని. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే తమకు సమాచారం అందించాలని సీఐ మంగళవారం కోరారు.