పిఠాపురంలో రేపు తలపెట్టనున్న జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ సభను జయప్రదం చేయాల్సిందిగా మండల జనసేన పార్టీ అధ్యక్షుడు యడ్ల సంతోష్ కోరారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ శుక్రవారం 11వ జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలను గుర్ల పరిధిలో ఉన్న నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆవిర్భావ దినోత్సవ జయప్రదం చేద్దామని సమావేశం ద్వారా తెలిపారు.