నెల్లిమర్ల: గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్

70చూసినవారు
నెల్లిమర్ల: గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్
నెల్లిమర్ల మండలం మోయిద సమీపంలో విజయరాంపురం గ్రామంలో గల చంపావతి నది తీరంలో గంజాయి కాలుస్తున్న ఐదుగురుని శనివారం పోలీసులు అరెస్టు చేసారు. వారి వద్ద నుంచి 100 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని నెలిమర్ల ఎస్సై గణేష్ తెలిపారు. వీరందరు చదువుకున్న స్టూడెంట్స్ అని విచారణలో తేలిందని చెప్పారు.  వీరు గంజాయిని ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ నుంచి గంజాయి తెచ్చుకుని సేవిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్