గుర్ల మండల కేంద్రం గుర్లలో యోగాంధ్ర కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా గుర్ల మూడు రోడ్ల వద్ద మానవహారం చేపట్టారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను ఎంపీడీవో శేషుబాబు వివరించారు. యోగాంధ్రలో జడ్పీటీసీ అప్పలనాయుడు, వైసీపీ మండల అధ్యక్షుడు సన్యాసి నాయుడు, ఎమ్మార్వో ఆదిలక్ష్మితో పాటు 600 మంది పాల్గొని ఆసనాలు వేశారు.